తెలుగు వార్తలు

Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu

Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.

పాకిస్తాన్తో యుద్ధంలోనే కాదు, అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదని మరో మారు తేల్చి చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చారు. భారత్ నుండి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల పైన అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందిస్తూ ప్రతీకార సుంకాలు విధించేందుకు
Posted: May 13, 2025, 10:18 am
Operation Keller: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్‌‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు. ఈ పరిణామాల మధ్య షోపియాన్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రత
Posted: May 13, 2025, 10:17 am
వేసవిలో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం ఇవాళ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల రాక ప్రారంభమైనట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈ రుతుపవనాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు తెలిపింది. దీంతో మరో వారం, రెండు వారాల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురవబోతున్నాయి. మే 13న నైరుతి
Posted: May 13, 2025, 10:13 am
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం రక్షణ రంగంలో అప్రమత్తమైంది. బ్రహ్మోస్, ఆకాష్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు కాకుండా, శాంతి నెలకొన్నప్పుడే సన్నద్ధత కీలకమని కేంద్రం భావిస్తోంది.
Posted: May 13, 2025, 9:49 am
ఏపీ మాజీ సీఎం, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా శత్రు మూకలపై వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ ముడావత్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోరంట్ల మండలం కల్లి తండాలో పర్యటించిన ఆయన దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళి నాయక్ తల్లిదండ్రులైన
Posted: May 13, 2025, 9:42 am
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు వీఐపీలు వాడుతున్న హెలికాఫ్టర్ ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హెలికాఫ్టర్ వాడకం వీరికి అంత సురక్షితం కాదన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఇవాళ సీఎం సహా వీఐపీలు వాడుతున్న హెలికాఫ్టర్ సామర్ధ్యంపై అధ్యయనం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ
Posted: May 13, 2025, 9:23 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ - 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అట్టహాసంగా ప్రారంభమైన 72వ ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా పోటీలో ఉన్నారు. ఇక అందాల భామలు
Posted: May 13, 2025, 9:04 am
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రేపు ఓ ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దీంతో రఘురామరాజు చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రేపు
Posted: May 13, 2025, 8:55 am
పేపర్‌ వర్క్, వేచి ఉండాల్సిన ఒత్తిడి లేకుండా వేగంగా డబ్బు కావాలా? దీనికి పర్సనల్‌ లోన్‌ చక్కని పరిష్కారం. మీరు సెలవులు ప్లాన్‌ చేస్తున్నా, వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడినా, లేదా ఇంటి ఖర్చుల కోసం బజాజ్‌ ఫైనాన్స్ నుంచి పర్సనల్‌ లోన్‌ పొందడం వేగం, సరళం, సులభం. సౌకర్యవంతంగా మీ ఇంట్లో కూర్చొని మీరు కేవలం
Posted: May 13, 2025, 8:54 am
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్యమైన నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలాజీ గోవిందప్ప మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మును షెల్ కంపెనీలకు మళ్ళిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్
Posted: May 13, 2025, 8:33 am
PM Modi at Adampur Air Base: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్‌‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటోన్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర
Posted: May 13, 2025, 7:54 am
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ను చేపట్టి విజయవంతమైన భారత సైన్యం ఆ తర్వాత పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించడంతో కాల్పుల విరమణ రూపంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనిపై దేశంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెరికా మాట విని మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై దాడి చేయకుండా వెనక్కి తగ్గడం ఏంటనే
Posted: May 13, 2025, 7:47 am
భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలలో 32 ఎయిర్పోర్ట్ లలో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎయిర్పోర్ట్ సర్వీసులను మళ్లీ పునరుద్ధరించిన మరుసటి రోజే పలు దేశీయ విమానయాన దిగ్గజాలు తమ సర్వీసులను రద్దు చేస్తూ
Posted: May 13, 2025, 7:38 am
అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉరుముతున్న వేళ భారతీయులకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బ్రిటన్ లోనూ అక్కడి కైర్ స్టార్మర్ ప్రభుత్వం వీరికి షాకిచ్చింది. భారతీయులతో పాటు వలసదారులందరికీ షాకిచ్చేలా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్న వలసదారులందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇందులో భారతీయులపై ఎక్కువ ప్రభావం
Posted: May 13, 2025, 7:11 am
ఉగ్రవాదులకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు భారతదేశం గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులకు తెగబడగా, పాక్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టింది. పాకిస్తాన్తో
Posted: May 13, 2025, 6:44 am
వైసీపీ రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో చోటు చేసుకుందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన
Posted: May 13, 2025, 6:31 am
Ceasefire: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్‌‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు. ఈ పరిణామాల మధ్య షోపియాన్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రత బలగాలు-
Posted: May 13, 2025, 6:11 am
పల్నాడు జిల్లాలో ఈరోజు ( మే 13, 2025 ) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వినుకొండ మండలం శివాపురం సమీపంలో జరిగింది. పొలం పనులకై వెళ్తుండగా.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన రైతు
Posted: May 13, 2025, 6:00 am
Todays Gold Rate:పసిడి ప్రియులకు శుభవార్త! ఈరోజు, మే 13, 2025న, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పసిడి రేట్లు కాస్త తగ్గడంతో ఆభరణాల కొనుగోలుదారులు మరియు మదుపరులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులు సహజమే
Posted: May 13, 2025, 4:24 am
తెలంగాణలో నేడే పాలీసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 3సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమాలల్లో అడ్మిషన్స్ భర్తీ చేయనున్నారు. పరీక్ష ఈరోజు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
Posted: May 13, 2025, 3:21 am
ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ మూకలు నరమేధం సృష్టించాయి. వారు చేసిన భారీ హింసాత్మక దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చాలా మంది సైనికులే ఉన్నారని తెలుస్తోంది. అలాగే పలువురు పౌరులు, మహిళలు, పిల్లలు కూడా ఈ ఉగ్ర దాడుల్లో బలయ్యారని సమాచారం. డజిబో సహా పలు ప్రాంతాల్లో విచక్షణా
Posted: May 13, 2025, 2:46 am
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనంతపురం మాజీ లోక్‌సభ సభ్యుడు దరూరు పుల్లయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం కర్ణాటక లోని బళ్లారిలో ఆయన నివాసం ఉంటున్నారు. సోమవారం నాడు ( మే 12, 2025 ) బళ్లారి నుంచి కంప్లి కొట్టాలలో ఉన్న తన పొలాన్ని చూడడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కంప్లిలో స్నేహితులతో
Posted: May 13, 2025, 2:21 am
ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 3
Posted: May 13, 2025, 1:55 am
సోమవారం సాయంత్రం జరిగిన డీజీఎంఓ స్థాయి చర్చల్లో కాల్పులు ఉండకూడదని, దూకుడు చర్యలకు స్వస్తి చెప్పాలని ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ, పాకిస్తాన్ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. సోమవారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని సాంబ, కథువా సెక్టార్లలో డ్రోన్ల ద్వారా దాడికి ప్రయత్నించడం వారి విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల పాక్ ప్రయత్నం
Posted: May 12, 2025, 7:45 pm
అమెరికాలో మందుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ మందుల ధరలను తగ్గించాలంటూ ఫార్మా కంపెనీలకు 30 రోజుల గడువు విధించారు. ఈ మేరకు ఒక కీలకమైన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ప్రకారం, మందుల తయారీదారులు 30 రోజుల్లోగా తమ ఉత్పత్తుల ధరలను
Posted: May 12, 2025, 7:10 pm
సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన డీజీఎంఓ స్థాయి చర్చల్లో ఇండియా, పాక్ దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారతదేశం , పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని, ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడకూడదని ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి.లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ , మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపి,
Posted: May 12, 2025, 4:55 pm
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నల కష్టం మాత్రం తీరడం లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పంటలు పండించి ధాన్యపు రాశులను మార్కెట్ కు తరలించిన సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క అకాల వర్షాలు, ఓ పక్క మండుటెండలు అన్నదాతలను విలవిలలాడేలా చేస్తున్నాయి. వడదెబ్బకు రైతు మృతి మళ్లీ
Posted: May 12, 2025, 3:35 pm
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బెంబేలెత్తిన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం కోరింది. ఈ నేపథ్యంలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంధి కుదుర్చారు. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. మిస్సైళ్లు, డ్రోన్లూ శాంతించాయి. సీజ్ ఫైర్ పై భారత్-పాక్
Posted: May 12, 2025, 3:28 pm
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఇందులో తొలుత ఉగ్రవాద శిబిరాలపైనా, ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లపైనా మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడులతు ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను శరణు వేడటంతో
Posted: May 12, 2025, 2:59 pm
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారం కోసం భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ ప్లాన్ చేసింది. దీంతో పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. తన చిరకాల మిత్రదేశం చైనాను సాయం కోరింది. దీంతో చైనా కార్గో విమానంలో భారీ ఎత్తున సైనిక సామాగ్రిని పాకిస్తాన్ కు పంపినట్లు ప్రచారం జరిగింది.
Posted: May 12, 2025, 2:23 pm
Andhra Bhavan, 28 St Mary’s Street, Preston, Lancashire, PR1 5LN, UK | Tel No. 07597021071 | Religious Worship No. 77711 | Charity Registration No: 1115907