తెలుగు వార్తలు
వార్తలు
వార్తలు
ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా మైనింగ్ గనులు కేటాయింపులు జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన రాష్ట్ర గనుల శాఖ మాజీ డైరక్టర్ రాజగోపాల్కు సీబీఐ కోర్టు ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి మేలు చేకూరేలా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఖచ్చితంగా ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, రాజగోపాల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో అధికారులు ఆయనను సోమవారం ఉదయం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనల అనంతరం కోర్టు ఆయన రిమాండ్ పొడిగించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
Posted: November 21, 2011, 10:14 am
రాష్ట్రాన్ని ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ అనే మూడు చిన్న రాష్ట్రాల కోసం ఏర్పాటు కోసం పోరాడుదామని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ....
Posted: November 21, 2011, 10:05 am
కాంగ్రెస్ పార్టీ జిరాక్స్ కాపీ వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అని రాష్ట్రమంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గూటికి రావడంలో తప్పులేదన్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే కాదని, ఇందిరా కాంగ్రెస్, సోనియా కాంగ్రెస్ ఇలా ఎన్ని కాంగ్రెస్లు వచ్చినా వాటికి తల్లి కాంగ్రెస్...
Posted: November 21, 2011, 8:59 am
ఈజిప్టు సైనిక పాలకులకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు కొనసాగిస్తున్న ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఆ దేశ రాజధాని కైరోలోని తెహ్రీర్ స్క్వేర్ వద్ద ఆందోళనకారులపై సైనికులు జరిపిన కాల్పులు, లాఠీఛార్జీలకు 12 మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్ పాలనకు వ్యతిరేకంగా, ఆయన గద్దెదిగాలని కోరుతూ ఆ దేశ ప్రజలు నిన్నమొన్నటి వరకు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో ఆయన గద్దెదిగిపోయారు. ఈజిప్టు పాలనాపగ్గాలు ఆ దేశ సైనికుల చేతుల్లోకి వెళ్లాయి. అయితే, దేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్కు దేశంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే, సైనికులు అరాచకాలకు వ్యతిరేకంగా ఈజిప్టు ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
Posted: November 21, 2011, 8:46 am
సీబీఐ అధికారులు దెయ్యాలు భూతాలు కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వ్యక్తిగతంగా అయితే కోర్టును ఆశ్రయించాల్సిన...
Posted: November 21, 2011, 8:40 am
రాష్ట్ర విభజన అంశంపై తమ ప్రభుత్వం చేయాల్సిన పనిని పూర్తి చేసిందని, ఇక కేంద్రం కోర్టులో రాష్ట్ర విభజన బంతి ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా చేయాలని కోరుతూ ఆమె నేతృత్వంలోని బీఎస్పీ ప్రభుత్వం సోమవారం ఒక తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి మూజువాణి...
Posted: November 21, 2011, 8:22 am
గిరిజన ప్రాబల్య ప్రాంతమైన దక్షిణ వజీరిస్థాన్ ప్రాంత స్థాయిలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులు, తాలిబన్ తీవ్రవాదుల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇవి కేవలం ప్రాథమిక స్థాయి చర్చలు మాత్రమేనని, ఈ చర్చలు కేవలం దక్షిణ వజీరిస్థాన్కు మాత్రమే పరిమితమని తాలిబన్ తీవ్రవాద సంస్థకు చెందిన అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ చర్చలు సఫలీకృతమైతే మిగిలిన గిరిజన ప్రాబల్య ప్రాంతాలపై కూడా చర్చలు జరుపుతామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్ఖైదాతో సన్నిహిత సంబంధాలు కలిగివున్న తాలిబన్ తీవ్రవాద సంస్థ పాక్ ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను పెట్టింది. వీటిలో ప్రధానంగా జైళ్ళలో మగ్గుతున్న తమ సంస్థ వారిని విడుదల చేయాలన్నది ప్రధాన డిమాండ్గా ఉంది.
Posted: November 21, 2011, 7:51 am
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి చేసిన ప్రతిపాదనపై యూపీలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇదే అంశంపై ఓ తీర్మానం చేసేందుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సోమవారం సమావేశమైంది. ఆ తర్వాత యూపీని నాలుగు రాష్ట్రాలు చేసే తీర్మానాన్ని ముఖ్యమంత్రి మాయావతి ప్రవేశపెట్టగా, ఈతీర్మానాన్ని భారతీయ జనతా పార్టీ, సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సభలో గందరగోళం నెలకొనడంతో తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఆ తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Posted: November 21, 2011, 7:39 am
భవిష్యత్లో ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాననే ఊహా ప్రపంచం నుంచి భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ బయటపడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ.బర్ధన్ హితవు పలికారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పదవిని చేపడతానన్న ఊహా ప్రపంచం నుంచి అద్వానీ బయటకు రావాలని సూచించారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ కూటమి అధికారంలోకి బర్ధన్ జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా లేదా ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించుకునేందుకే అద్వానీ అవినీతి పేరుతో జనచేతన రథయాత్రను చేపట్టారని ఆయన గుర్తు చేశారు. అలాగే, పార్టీలో తన ప్రాభవాన్ని కాపాడుకొనేందుకే అద్వానీ పడరాని పాట్లు పడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
Posted: November 21, 2011, 7:25 am
అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన అనుచరులుగా చెప్పుకునే ఎంపీలు నామా నాగేశ్వర రావు (లోక్సభ), సుజనా చౌదరీ (రాజ్యసభ)లు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలంటూ సీబీఐను హైకోర్టు ఆదేశించడంపై నిలుపుదల చేయాలంటూ వారు సోమవారం పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రిజిస్టరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మంగళ లేదా బుధవారాల్లో విచారణకు రావొచ్చని తెలుస్తోంది. వీరిద్దరితో పాటు.. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి సీహెచ్.రామోజీ రావు కూడా ఈ పిటీషన్ను దాఖలు చేశారు.
Posted: November 21, 2011, 6:40 am
తమ పార్టీతో పాటు ఎన్డీయే కూటమికి చెందిన ఎంపీలకు విదేశీ బ్యాంకుల్లో రహస్య ఖాతాలేవీ లేవంటూ రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తమ కూటమి ఎంపీలంతా డిక్లరేషన్ ఇస్తారని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ప్రకటించారు. తన జనచేతన యాత్ర ముగింపు సభలో అద్వానీ ప్రసంగిస్తూ దేశం బయట తనకు అక్రమ ఆస్తులు కానీ, ప్రత్యక్షంగా, పరోక్షంగా విదేశీ ఖాతాలు కానీ లేవని సత్యనిష్టతో ప్రకటిస్తున్నానని ఆ డిక్లరేషన్లో ఉంటుందని వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయని, ఆ తర్వాత వారం రోజుల్లోపు లోక్సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీలకు ఎన్డీయేకు చెందిన 215 మంది ఎంపీలూ డిక్లరేషన్ల ఇస్తారని అద్వానీ తెలిపారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడంలో ప్రభుత్వ చర్యలపై యూపీఏ ప్రభుత్వ చర్యలు అస్పష్టంగా ఉన్నాయన్నారు. పటిష్టమైన లోక్పాల్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
Posted: November 21, 2011, 5:36 am
ఈజిప్టు మరోమారు ఆందోళనలతో అట్టుడికి పోతోంది. మొన్నటి వరకు ఈజిప్టు అధ్యక్షుడు ముబారక్కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన ప్రజలు.. ఇపుడు ఈజిప్టు సైనిక పాలకులకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ఈజిప్టు వీధులన్నీ ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైనికుల పాలకులు అక్కడక్కడా లాఠీలకు పని చెపుతున్నారు. మరికొన్ని చోట్ల జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందగా, 800 మందికి పైగా గాయపడ్డారు. ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ను గద్దెదించిన ఈజిప్టు ప్రజలు అదే స్ఫూర్తితో మిలిటరీ పాలకుల అరాచకాలపై ఏకమయ్యారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసి, మిలిటరీ పాలనకు ముగింపు పలకాలంటూ రెండు రోజలు క్రితం ఆందోళనలు ఉధృతం చేశారు. వేల మంది ఈజిప్టువాసులు కైరోలోని తహ్రీర్ స్క్వేర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Posted: November 21, 2011, 5:26 am
రాష్ట్ర విభజన అధ్యయనం పేరుతో జస్టీస్ శ్రీకృష్ణ కమిటి కోట్లాది రూపాయలను దండుకుందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సాగుతున్న తెలంగాణ సాధన పాదయాత్రలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఏడాది పాటు జేబులు నింపుకుందన్నారు. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర హోంమంత్రి ప్రకటించినట్లు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేక ప్రకటనలపై సమాధానం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా తెలంగాణ ప్రకటించిదన్న కాంగ్రెస్ నాయకులు ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Posted: November 21, 2011, 4:22 am
ఇరాన్ అణు కార్యక్రమం ఆందోళనలు రేకెత్తించే విధంగా ఉందని, దీన్ని అడ్డుకోవాలని పేర్కొంటూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సంస్థలోని 35 సభ్యదేశాల్లో 32 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అనుకూలంగా ఓటేసిన దేశాల్లో భారత్ కూడా ఉండటం గమనార్హం. మరో మూడు దేశాల్లో ఇండోనేషియా ఓటింగ్ను బహిష్కరించగా, క్యూబా, ఈక్వెడార్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. అణుకార్యక్రమంపై ఇక ఏమాత్రం జాప్యం చేయరాదని, తక్షణమే ఐఏఈఏలు చర్చలు జరపాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఐఏఈఏ ఇరాన్ ప్రతినిధి అలీ సొల్తానెయా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Posted: November 21, 2011, 4:15 am
ఐక్యరాజ్యసమితిలో భద్రతా మండలిలో భారత్ శాశ్వత స్వభ్యత్వానికి సింగపూర్ మద్దతు ప్రకటించింది. ఆసియా అభివృద్ధి, స్థిరత్వానికి భారత్ విశేషమైన సహకారం అందించాల్సి ఉందని సింగపూర్ ప్రధానమంత్రి లీ సీయిన్ లూంగ్ అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని మన్మోహన్సింగ్ సింగపూర్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లీ సీయిన్ లూంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ చురుకైన పాత్ర పోషించాలని సింగపూర్ కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య, భద్రత రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించనున్నామని తెలిపారు. సింగపూర్లోని ఏషియన్ సివిలైజేషన్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన భారత తొలి ప్రధాని, దివంగత జవహర్లాల్ నెహ్రూ కంచు విగ్రహాన్ని ప్రధాని మన్మోహన్సింగ్ ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు.
Posted: November 21, 2011, 4:10 am
వచ్చే యేడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన ఎన్నికల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 22వ తేదీన బారాబంకీ జిల్లాలో యాత్ర ప్రారంభించి ఆరు రోజుల పాటు వివిధ జిల్లాల్లో రాహుల్ పర్యటిస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషీ తెలిపారు. యూపీలో మాఫియా పాలన కొనసాగుతోందని, దానికి అడ్డుకట్ట వేయాలంటూ ఈ నెల 14వ తేదీన రాహుల్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీతో పాటు బలరాంపూర్, శ్రావస్తి, బహ్రాయిచ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలపై చర్చిస్తారని చెప్పారు. రాహుల్ వివిధ జిల్లాల్లో బ్లాక్ స్థాయి కార్యకర్తలతో సమావేశమై 2012 అసెంబ్లీ ఎన్నికలకు వారిని సమాయత్తం చేస్తారని జోషీ వివరించారు.
Posted: November 21, 2011, 3:57 am
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలంగాణ అంశంపై వివిధ జాతీయ పార్టీలకు చెందిన నేతల మద్దతును కూడగట్టేందుకు ఆయన ఒక రోజు ముందుగానే హస్తినకు చేరుకుంటున్నారు. ఆయన జాతీయ నేతలతో జరిపే సమాలోచనల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మద్దతు తెలిపే పార్టీలతో కలిసి పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై ఇందులో చర్చిస్తారని తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు 42 రోజులు పాటు సకల జనుల సమ్మె చేసినా.. కేంద్రం పూర్తి స్థాయిలో స్పందించక పోవడంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
Posted: November 21, 2011, 3:31 am
టర్కీలోని వాన్ రాష్ట్రంలో సంభవించిన రెండు భారీ భూకంపాల్లో మొత్తం 644 మంది మృతి చెందినట్లు టర్కీ ప్రధాన మంత్రి శాఖకు చెందిన ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ డైరెక్టరేట్ ప్రకటించింది. గత అక్టోబర్ 23న రిక్టర్ స్కేలుపై 7.2 పాయింట్ల తీవ్రతతో వాన్ రాష్ట్రంలో సంభవించిన భూకంపంలో 604 మంది పౌరులు మృతి చెందగా, 222 మందిని కాపాడినట్లు ఆ డైరెక్టరేట్ వెల్లడించింది.
Posted: November 19, 2011, 3:50 am




